మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఎమ్మెల్యేలు..

114
Minister Errabelli
- Advertisement -

సోమవారం పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. తమ నియోజకవర్గానికి చెందిన సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే,విప్ బాల్క సుమన్,సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్,అలంపూర్ ఎమ్మెల్యే ఇబ్రహీం, దేవరకద్ర ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -