బర్త్ డే…మొక్కలు నాటిన షాద్‌నగర్ ఎమ్మెల్యే

152
mla yadaiah
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని తన స్వగ్రామం అయిన ఎలక్షన్ పేట లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని మా నియోజకవర్గ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -