మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి..

136
MLA Venkateshwar Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి దేవరకద్ర శాసనసభ్యులు తన జన్మదినం సందర్బంగా మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన హరితహారం భవిష్యత్ తరాలకు పచ్చని బంగారు బాట, చక్కటి ఆక్సిజన్ కోసం, ఇప్పుడు పచ్చదనం కోసం హరిత హారం చేపట్టారు దీనికి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం వాటిని కాపాడే బాధ్యత, పర్యావరణ పరిరక్షణకి తీసుకుంటున్న చొరవ అభినందనీయం.

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని కోరారు ఎమ్మెల్యేలు.

- Advertisement -