మొక్కలు నాటిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..

262
MLA Shankar Nayak
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతిని మనం సంరక్షించితే అది మనల్ని కాపాడుతుంది అని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన క్యాంపు కార్యాలయంలోనే మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -