గ్రేటర్ ఎన్నికలు: పవన్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

207
roja
- Advertisement -

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అన్నారు ఆంధ్రప్రదేశ్‌ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్‌ జనసేనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. నిజంగా అది జనసేన పార్టీయా, లేక కేటీఆర్ అన్నట్టు మోదీ భజనసేన పార్టీయా అనేది అర్థం కావడంలేదని రోజా ఎద్దేవా చేశారు. ఎందుకంటే తన పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికలకు పోకుండా టీడీపీ, బీజేపీలకు ప్రచారం చేసి వాళ్లకు ఓట్లు వేయాలని ప్రజలకు చెప్పారని, ఏంజరిగినా తాను చూసుకుంటానని అన్నారని వెల్లడించారు. కానీ ఈ రాష్ట్రం అతలాకుతలం అయిందని, మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు అయ్యాయని రోజా పేర్కొన్నారు.అనేక సమస్యలకు చంద్రబాబు కారణం అయినా, ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ ఇవ్వకపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదని దుయ్యబట్టారు.

ఇక ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చూస్తే బీజేపీ కోసం జనసేన తప్పుకుంది. బీజేపీ నీడలో జనసేన మెలుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ సైతం ఒంటరి పోటీకి ధైర్యం చేయలేక, కమలనాథుల వెంటనే పయనిస్తున్నారు. పేరుకే సొంత పార్టీ అయినప్పటికీ.. బీజేపీ నేతల కకబంధహస్తాల్లో చిక్కుకుపోయి అంతా కాషాయ నేతలకే వదిలేస్తున్నారు. బీజేపీకి కొన్ని ఓట్లు పడాలి, టీఆర్ఎస్ ఓడాలి అంటూ ఎన్నికల నుంచి వైదొలిగారని రోజా తెలిపారు.

మళ్ళీ ఇప్పుడు తిరుపతికొచ్చి పవన్‌ పోటీచేస్తున్నారు. గతంలో తన సొంత నియోజకవర్గంలో, తన సొంతవాళ్ల మధ్యే గెలవలేని వ్యక్తి ఇప్పుడు తిరుపతి వచ్చి ఏం చేస్తాడు? తిరుపతిలో సీటు కావాలని అన్నాడు అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని భావించాలా? గ్రేటర్‌లో వదులుకున్నాం కాబట్టి తిరుపతిలో సీటు ఇవ్వాలని బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నారా?” అని రోజా ప్రశ్నించారు.

- Advertisement -