ఉమెన్స్‌ డే స్పెషల్..ఎన్నికల క్యాంపెయిన్‌

226
roja nagari
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థిత్వం ఖారారైన నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ,టీడీపీ మహిళా నేతలు.

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా రిక్షా ఎక్కారు. నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రిక్షా తొక్కారు. ఎమ్మెల్యే కావాలన్న తన జీవితకాల కోరికను నెరవేర్చుకున్న రోజా రెండోసారి నగరి నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన రిక్షాలను రోజా ప్రారంభించారు.

ఇక విజయవాడ పశ్చిమ నుండి జలీల్ ఖాన్ కుమార్తె, టీడీపీ అభ్యర్ధి షబానా ఖాతూన్,ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత మహిళా దినోత్సవం రోజున ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేశినేని నాని మరోసారి విజయవాడ ఎంపీగా బరిలోకి దిగనుండగా జలీల్ ఖాన్ మాత్రం పశ్చిమ నియోజకవర్గం నుంచి తనకు బదులుగా కూతురు షబానాను రంగంలోకి దింపుతున్నారు. మొత్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారాన్ని ప్రారంభించిన ఈ మహిళా నేతలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.

- Advertisement -