సీఎం స‌హాయ‌నిధికి టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల విరాళం..

338
corona
- Advertisement -

క‌రోనా నివార‌ణ కోసం సీఎం స‌హాయ‌నిధికి టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు విరాళం అందించారు. జ‌న‌గాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి,ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్,ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి విరాళాల‌ను అందించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ని క‌లిసిన పైల‌ట్ రోహిత్ రెడ్డి త‌న నెల జీతం చెక్కును సీఎంకు అంద‌జేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి రెండు నెలల జీతం 5లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

ఇక త‌న‌వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి పదిలక్షల రూపాయల విరాళం ప్రకటించారు ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్.

- Advertisement -