వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే మర్రి

302
mla marri
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని లక్నరాం గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు,అనంతరం పలువురు రైతులతో మాట్లాడుతూ వారు పండించిన పంటల వివరాలు తెలుసుకున్నారు,కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా,గన్ని బాగ్స్ సరైన టైంలో ఇస్తున్నార లేదా అని తెలుసుకున్నారు.

లారీల కొరత లేకుండా చూసుకోవాలని, రైతులు తెచ్చిన ధాన్యం వర్షాలకు తడవకుండా చూడాలని. pacs అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో pacs చైర్మన్ భాస్కర్ రెడ్డి ,సర్పంచ్ పల్లవి ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -