ఖమ్మంలో 13 సీసీఐ కొనుగోలు కేంద్రాలు: పువ్వాడ

301
minister puvvada
- Advertisement -

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని వెల్లడించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌. ఖమ్మం త్రీ టౌన్‌లోని పత్తి మార్కెట్‌లో సీసీఐ ద్వారా ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు పువ్వాడ.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి నల్లబడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని…ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సీఎం కేసీఆర్ చొరవ‌తో పత్తి రైతులను ఆదుకునేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో పత్తిని కొనాలని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 105.1 లక్షల బేళ్లు కొనుగోలు చేయగా ఒక్క తెలంగాణ నుంచి 41.8 లక్షల బేళ్లు కొనుగోలు చేయడం జరిగిందనన్నారు.

పత్తి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రైవేట్ పత్తి కొనుగోలు వ్యాపారులు సైతం రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పువ్వాడ.

- Advertisement -