సురేష్ భూమి కబ్జా చేసింది కాంగ్రెస్ నాయకులేః  ఎమ్మెల్యే మంచిరెడ్డి

553
manchireddy Kishan Reddy
- Advertisement -

అబ్బల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి శవం ముందు కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈసందర్భంగా నేడు మీడియా సమావేశం నిర్వహించారు. మల్ రెడ్డి బద్రర్స్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికి మల్ రెడ్డి బ్రదర్స్ మీడియా ని తప్పుపట్టిస్తున్నారు. నా పై మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.

విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఎమ్మెల్యే మంచిరెడ్డి. నిందితులని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతాను. ఎమ్ ఆర్ ఓ మృతి పై పోలిస్ శాఖ తనపని తాను చేస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ చేసిన కబ్జాకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముద్దాయి సురేష్ వాళ్ల కుటుంబ సభ్యుల వద్ద నుండి మల్రెడ్డి కుటుంబ సభ్యులు భూమి కొనడం జరిగింది. ఆయన చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేందుకే నాపై బురద జల్లుతున్నాడు. ఇద్దరు ముస్లింలపై టెనెంట్ చేయించి వారి నుండి మల్రెడ్డి కుటుంబ సభ్యులు 16 ఎకరాల వరకు కొనుక్కున్నారు. మళ్ళీ దుర్గయ్య మరియు కృష్ణయ్య దగ్గర ఉన్న ఒక ఎకరా కూడా కొంనటం జరిగిందన్నారు.

మొత్తం 6 మంది పై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. 412 ఎకరాలు ఎవరెవరిపై ఉన్నాయో..వారికి ఎలా వచ్చాయో విచారణ చేయాలని చెప్పారు. లోకల్ కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని జేసీ కి కూడా చెప్పడం జరిగిందన్నారు. సురేష్ వాళ్ల కుటుంబ సభ్యులు భూమి అమ్మిన విషయం సురేష్ కి తెలియదు. సదరు 412 ఎకరాల పై పూర్తి విచారణ చేయాలని సి ఎమ్ కి, సి ఎస్ మరియు డిజిపి కి పిర్యాదు చేస్తాను. నా పై ఆరోపణలు వస్తే ప్రూఫ్ చేయండని సవాల్ విసిరారు.

- Advertisement -