మొక్కలు నాటిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..

210
gic
- Advertisement -

తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నియోజకవర్గం అంతటా మొక్కలు నాటించారు మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా జడ్చర్ల నియోజకవర్గం లోని 140 గ్రామాల్లో పార్టీ నాయకులు ప్రజాప్రతినిధుల బాగాసామ్యం తో 16116 మొక్కలను నాటడం జరిగిందన్నారు.

ఈ పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతుందని పచ్చదనం పెంచడం కోసం ఈ చాలెంజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంది అని అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.నా విజ్ఞప్తి మేరకు నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటిన TRS పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -