టీఆర్ఎస్‌దే గెలుపు: ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి

223
kandala
- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్‌ గెలపును కాంక్షిస్తూ పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ ఓటర్లు, కార్యకర్తలతో సమావేశాని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి అని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాత మధు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -