నేను ప్రజల సేవకున్ని-ఎమ్మెల్యే హరీష్‌రావు

285
Harish Rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా:సిద్దిపేట ఆర్బాన్ మండలం ఎన్సాంపల్లి గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సభ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఇదే చివరి ఎలక్షన్ కాబట్టి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి. ప్రజలకు సేవా చేయడమే నా డ్యూటీ ,నేను ప్రజల సేవకుడిని.ఎంపీటీసీ, జడ్పీటీసీ, జోడెడ్ల లాంటి వాళ్ళు ఇద్దరు గెలిస్తేనే మీకు మంచి సేవా చేస్తాం. 5ఏండ్లు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం అన్నారు. ఇక దసరా నాటికి గోదావరి నీళ్లతో ఉర్లల్లో చెరువు నిండుతాయి.

Harish Rao

ఆరు నెలల్లో చెదబావిల్లో నీరు ముంచే రోజులు వస్తాయి. ఆరు నెలల్లో రంగనాయక సాగర్ కు నీరు తెస్తాం. 500 కోట్లతో ఏంసంపల్లిలో 500 మంచాల దవాఖాన కడుతున్నాం. ఈ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థులను తప్పకుండా గెల్పించాలని ఆయన కోరారు. మీ ఆండతో కేసీఆర్ సీఎం గా ఉండు నేను ఎమ్మెల్యే గా ఉన్నా అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీగా టీఆరెస్ అభ్యర్థులు గెలివాలని ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట అంటేనే హరిషన్న. మీ ఆశిశులతో ఎంపీ ఎన్నికల్లో నాకు ఓటేశారు. కాళేశ్వరం కాలువలు అయినాయి అంటే అది హరిషన్నకే చెందును. దేశములో సిద్దిపేట పేరున్న జిల్లా. మహిళలే అన్ని రంగాలలో ముందుండి నడిపిస్తున కాలం ఇది. నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాడు.అభివృద్ధి కోసం మీటింగ్లు వుంటాయి తప్ప ఎలక్షన్ కోసం ఉండవు. ఇదే చివరి ఎన్నికలు కావున అందరు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నాను.

- Advertisement -