జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ విజయన్ని అందుకుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్పి స్థానాలను TRS కైవసం చేసుకుంది. ముఖ్యంగా సిద్దిపేటలో క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ విజయదుందుభిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్పీ స్థానాలనూ కైవసం చేసుకున్నామని టీఆర్ఎస్ ఘన విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఎంపీ ఎన్నికల తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపుగా ఏకపక్షంగా టీఆర్ఎస్ విజయం సాధించింది.
చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారన్నారు. అలగే ఈ విజయంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రజలు మరోసారి నిరూపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హరీశ్ పేర్కొన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలది. ఈ విజయం మాపై బాధ్యతను మరింత పెంచిందని హరీష్రావు అన్నారు.