మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన ఎమ్మెల్యే కిశోర్..

220
MLA Kishore
- Advertisement -

మంత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్ కు వెంటనే స్పందించారు తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్. వివరాల్లోకి వెళ్లితే.. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం అవాస చాకలిగూడెంకు చెందిన దర్శనం సతీష్ ప్రమాదవశాత్తు ఎనిమిది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు అక్షిత (5 సం..), లాస్య (4 సం..), బేబీ (8 నెలలు) ఆకుటుంబ పరిస్థితి గురించి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే మంత్రి కేటీఆర్ స్థానిక శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేయడంతో ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

ముగ్గురు చిన్నారుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కొక్కరి మీద రూ.50,000/- (యాభై వేల రూపాయలు) ఫిక్సీడ్ డిపాజిట్ తో పాటు తక్షణ సాయం క్రింద 50,000/- (యాభై వేల రూపాయలు) మొత్తం ₹2,00,000/- (రెండు లక్షల రూపాయలు) కుటుంబ సభ్యులు దర్శనం శిల్పకు ఆర్థికసాయం అందజేశారు. అలాగే దర్శనం శిల్పకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలలో చేర్పించి, ఉండడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని అన్నారు, పిల్లలకు నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే కిశోర్‌ హామీ ఇచ్చారు.

- Advertisement -