కరోనాను తరిమికొడదాం: ఎమ్మెల్యే దానం

242
danam
- Advertisement -

ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వీయనిర్బంధం పాటించి కరోనా మహమ్మరిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్‌లో దానం లింగమూర్తి ట్రస్ట్ పేరుతో ఖైరతాబాద్ డివిజన్ లైబ్రరీ ,సోమజిగూడా డివిజన్ బిఎస్ మక్తా, జూబ్లీహిల్స్ డివిజన్ గాయత్రి హిల్స్ లోని పేదలకు, వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు దానం.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ అయిపోయే వరకు ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తాం అన్నారు.పేదలకు రేషన్ తో పాటు 1500 రూపాయలు అలాగే వలస కూలీలకు రేషన్ తో పాటు 500 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

ప్రతి పక్షాలు రాజకీయాలు మనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అందరూ కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ప్రతిపక్షాలు కండ్లుండి చూడలేని చెవులుండి వినలేని పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ,వలస కూలీలను సీఎం కేసీఆర్ కన్న బిడ్డల్లా చూసుకుంటూన్నారని తెలిపారు.

- Advertisement -