బర్త్ డే…మొక్కలు నాటిన చిరుమర్తి లింగయ్య

273
lingaiah
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు నకిరేకల్ లో మొక్కలు నాటారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం చాలా కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.

నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -