ఖేల్ రత్న అవార్డు అందుకున్న మిథాలీ,నీరజ్ చోప్రా

133
Mithali Raj
- Advertisement -

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్ రత్న’ పేరును ఇటీవల కేంద్రం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా మార్చడం తెలిసిందే. ఈ అవార్డును ఒలిపింక్స్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ ఖేల్‌రత్న అవార్డులను రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నుంచి అందుకున్నారు. ఈ నెల 2న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించగా.. శనివారం రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాలులో అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ ఏడాది 12 మందిని ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలు వరించగా.. హాకీ ఆటగాళ్లు మన్ ప్రీత్ సింగ్, శ్రీజేష్, రవికుమార్ (రెజ్లింగ్), సునీల్ ఛెత్రీ (ఫుట్ బాల్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్), అవని లేఖర (పారా షూటర్), సుమీత్ ఆంటిల్ (పారా జావెలిన్ త్రోయర్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్ ప్లేయర్), కృష్ణా నాగర్ (పారా బ్యాడ్మింటన్ ప్లేయర్), మనీష్ నర్వాల్ (పారా షూటర్) కూడా ‘ఖేల్ రత్న’ అందుకున్నారు.

- Advertisement -