టీ20 వరల్డ్ కప్లో ఐర్లాండ్తో జరిగే ప్రారంభ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్వుడ్లు టోర్నమెంట్కు దూరమవగా, ఇప్పుడు జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా గాయంతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.
ఈ వారం ప్రారంభంలో ప్రాక్టీస్ సమయంలో మార్ష్ గ్రోయిన్ ప్రాంతంలో బలంగా తగిలింది. అనంతరం చేసిన స్కాన్లలో అంతర్గత వృషణ రక్తస్రావం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నొప్పి మరియు అసౌకర్యం కారణంగా ఆయన కదలికలు పరిమితమయ్యాయి. కొలంబోలో టాస్కు ముందు ఆయన గైర్హాజరు విషయాన్ని ప్రకటించారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటనలో మార్ష్కు విశ్రాంతి మరియు పునరావాసం అవసరం. ఆయన మళ్లీ ఆడటానికి వైద్యుల సలహా, లక్షణాల తగ్గుదల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపింది. అతని స్థానంలో రిజర్వ్ ప్లేయర్గా స్టీవ్ స్మిత్ను శ్రీలంకకు పంపుతున్నట్లు వెల్లడించింది. అవసరమైతే జట్టులో చేర్చేందుకు ఆయన సిద్ధంగా ఉంటారు.
ఇప్పటికే గాయాలతో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు ఇది మరో సమస్యగా మారింది. టిమ్ డేవిడ్ కూడా హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుంటూ ఉండడంతో ఐర్లాండ్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు.
Also Read:మున్సిపల్ ఎన్నికలు..ఉద్రిక్త పరిస్థితులు
2024 ఫిబ్రవరి తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడని స్మిత్, ఇటీవల బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో 299 పరుగులు, సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97తో ఆకట్టుకున్నాడు. మొదట టోర్నమెంట్కు ఎంపిక కాలేకపోయినా, గాయాల కారణంగా ఇప్పుడు ఆయనకు అవకాశం లభించే పరిస్థితి ఏర్పడింది.

