KTR:సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి మంచినీరు

30
- Advertisement -

సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలో ప్ర‌తి ఇంటికి మంచినీటి స‌ర‌ఫ‌రా అందించిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను ది ఇండియ‌న్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేయగా ఈ జాబితాలో తెలంగాణ మొద‌టి స్థానంలో నిలిచింది.

దీంతో దీనిపై స్పందించిన కేటీఆర్.. విజ‌న్ ఉన్న కేసీఆర్ తెలంగాణ‌కు సీఎంగా ఉండ‌టం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఈ ప‌థ‌కం తెలంగాణ‌లో విజ‌య‌వంత‌మైన త‌ర్వాతే కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ అనే ప‌థ‌కాన్ని తీసుకొచ్చింద‌ని వెల్లడించారు. ఇవాళ తెలంగాణ ఏది చేస్తే మిగిలిన రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయ‌ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -