7,450 కిమీల రహదారుల నిర్మాణం: మంత్రి వేముల

326
minister vemula
- Advertisement -

రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన గత ఆరేళ్లలో రహదారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేశారని చెప్పారు.

దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 400కు పైగా వంతెనల నిర్మాణం చేపట్టామని నదులపై రూ.984 కోట్లతో 26 భారీ వంతెనల నిర్మాణం చేపట్టినట్లు వీటిల్లో ఇప్పటికే 16 వంతెనలు పూర్తి అయినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో రోడ్లను డీలింక్‌ చేసే లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీలను కడుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం 7,450 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. వాగులపై వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

- Advertisement -