మిడ్‌ మానేరులో చేపపిల్లలను వదిలిన మంత్రి తలసాని..

184
talasani
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని మిడ్ మానేర్ డ్యాం లో చేప పిల్లలను విడుదల చేశారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్.రాష్ట్రంలో ని అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం అన్నారు శ్రీనివాస్ యాదవ్.

ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి KCR గారికి అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉందిని తెలిపారు. కులవృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి ఆశయం అన్నారు.మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.ఈ సంవత్సరం రాష్ట్రంలో ని అన్ని నీటి వనరులలో 81 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లల విడుదల చేయనున్నామని వెల్లడించారు.

- Advertisement -