ముఖేశ్‌ గౌడ్‌ మృతిపట్ల తలసాని సంతాపం..

508
talasani
- Advertisement -

కాంగ్రెస్‌ మాజీ మంత్రి ఎం.ముఖేశ్‌ గౌడ్‌(60) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ముఖేష్‌ గౌడ్‌ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖేష్‌ గౌడ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

talasani srinivas

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముకేశ్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముకేశ్ గౌడ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. ఆయన మృతి చాలా బాధాకరం అన్నారు తలసాని. కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి స్థాయి వరకు సేవలు అందించారు.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మంత్రి అన్నారు.

- Advertisement -