‘మన్మథుడు 2’ నుండి మనసుదోచే పాట..

475
Manmadhudu 2
- Advertisement -

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’.రకుల్‌ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్ ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. దాదాపు విదేశాల్లోనే నిర్మితమైన ఈ చిత్రంలోని రెండో పాటను నాగార్జున ట్విటర్లో విడుదల చేశారు.

“నా లోనా నీవేనా ప్రేమై నేడు పూచేనా .. ” అంటూ ఈ పాట సాగుతోంది. నాగ్ – రకుల్ పై చిత్రీకరించిన ఈ పాట కొత్తగా వుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం .. శుభం విశ్వనాథ్ సాహిత్యం .. చిన్మయి ఆలాపన .. ఆకట్టుకునేలా వున్నాయి. కీర్తి సురేశ్ .. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 9వ తేదీన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను విడుదల చేయనున్నారు.

- Advertisement -