భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి- మంత్రి తలసాని

259
Minister Talasani
- Advertisement -

మంగళవారం నాడు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో భాగంగా పెద్దవూర మండలం తెప్పలమడుగు, లింగంపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ లింగయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న రోజుల్లో నియోజకవర్గాన్ని పట్టించుకోని జానారెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో వ్యవసాయం నాశనమైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదని మంత్రి విమర్శించారు.

సాగర్‌ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందన్నారు. నేరుగా అర్హులకే పథకాలు అందజేస్తుందన్నారు. నిరంతరం ప్రజలతోనే ఉండే విద్యావంతుడు, యువకుడైన భగత్‌ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని కోరారు.

- Advertisement -