బీజేపీ నేతల తప్పుడు ప్రచారంపై మంత్రి తలసాని ఫైర్‌..

182
minister talasani
- Advertisement -

హైదరాబాద్‌లో సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తారా, మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రాన్ని మీరు ఎప్పుడైనాపాలించారా.. సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం పేదలను ఆదుకుంటున్నదని మంత్రి చెప్పారు. బీజేపీని చూసి ఎంఐఎం నేతలు మాట్లాడుతున్నారని తెలిపారు. అసెంబ్లీలో వారి సంఖ్య ఎంత? వారి బలమెంత అని మంత్రి తలసాని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఉండే బండి సంజయ్‌కు హైదరాబాద్‌కు గురించి ఏం తెలుసని విమర్శించారు.

హైదరాబాద్‌లో 40 వేల మంది రొహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. పాతబస్తీలో 40 వేలమంది రొహింగ్యాలుంటే కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా ఇంతవరకూ ఒక పైసా ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హైదరాబద్‌ గురించి మాట్లాడుతున్నారు.. ముందు తన నియోజకవర్గాన్ని చూసుకుంటే బాగుంటుందని మంత్రి సూచించారు. ఇక కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆచరణసాధ్యంకాని హామీలిచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో జీహెచ్‌ఎంసీకి సంబంధం లేని హామీలున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.

- Advertisement -