ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదు…

59
talasani
- Advertisement -

ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆదివారం కొమురవెళ్లి మల్లన్నను మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం మాట్లాడిన తలసాని..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసేందుకే ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతుందన్నారు. కేంద్రానికి దమ్ముంటే అభివృద్ధి లో పోటీ పడాలని, ప్రశ్నించే గొంతులను నొక్కడం సరి కాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే, కొందరు దేవుళ్ల పేరుపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వేల కోట్ల రూపాయల అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన వారిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కవిత ఉద్యమాలే ఊపిరిగా, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మెల్సీ కవితను,మహిళలను కించపరిచే విధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపనీయమన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -