పసిడి కొనుగోలుదారులకు షాక్..

13
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.52,150కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.820 పెరిగి రూ.56,890కు చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.52,300కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,040కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.450 పెరిగి రూ.65,700కు చేరగా హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1400 పెరిగి రూ.68,700కి చేరాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1868.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.060 వద్దకు చేరింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -