ఆమోస్ భౌతికకాయానికి శ్రీనివాస్ గౌడ్ నివాళి..

485
minister srinivas reddy
- Advertisement -

తెలంగాణ ఉద్యమ నేత కేఆర్‌ ఆమోస్‌ ఇకలేరు. 1969 ఉద్యమంలో ముందువరుసలో నిలిచిన నాయకుడు ఆమోస్‌ గురువారం రాత్రి మల్కాజిగిరిలోని తన నివాసంలో కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు.

aamos

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమంలో KR అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. KR అమోస్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూశారు. ఎంతో ఆనంద పడ్డారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. KR అమోస్ భౌతికంగా దూరమైన వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు.

KR amos

అమోస్ కుటుంబానికి ఉద్యోగుల, ప్రభుత్వం తరపున తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. KR అమోస్ భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో రాష్ట్ర TNGO అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, TGO నాయకులు కృష్ణ యాదవ్ మరియు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -