మెడికల్ విద్యార్ధులను అభినందించిన గవర్నర్‌..

445
- Advertisement -

ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన సీనియర్ విద్యార్ధులను తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళ సై సౌందరరాజన్,బండారు దత్తాత్రేయ గోల్డ్ మెడల్‌తో అభినందించారు. ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధికి బండారు దత్తాత్రేయ ఎంతో సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర గవర్నర్ అభిప్రాయపడ్డారు. మెడికల్ విద్యలో క్వాలిటీ పెంచేందుకు ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

Dattatreya_Tamilisai

ఉత్తమ ఫలితాలు కనబరిచిన వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉండటం గర్వంగా ఉందని తమిళ సై అభిప్రాయపడ్డారు. నేను డాక్టర్‌గా ఈఎస్ఐ మెడికల్ కాలేజీకి రావడం చాలా సంతోషంగా ఉంది. వైద్య వృత్తి అనేది ఎంతో పవిత్రమైనది. కేంద్ర కార్మికమంత్రిగా బండారు దత్తాత్రేయ ఉన్నప్పుడు ESIC మెడికల్ కళాశాలకు అభివృద్ధి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను గవర్నర్ లు అభినందించారు.

- Advertisement -