బీసీ ఆత్మ గౌరవ భవనాలను త్వరగా పూర్తి చేస్తాం..

704
minister gangula
- Advertisement -

ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీసీ కులాలకు రంగా రెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేది. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకబడిన కులాల, వర్గాలు గొప్ప స్థాయికి చేరుకోవాలని హైదరాబాద్ నగరంలోని కోక పేటలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పటికే ప్రభుత్వం బీసీలకు 80 ఎకరాల భూమిని కేటాయించింది. నిర్మాణాలకు 80 కోట్ల రూపాయలను కేటాయించారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఈ భవనాలను త్వరగా కట్టేందుకు అని సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్‌.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్‌ఎండీఎ పరిధిలోని సుమారు రెండు, మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని బీసీ కులాలకు ఆత్మగౌరవం భవనాల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు 80 శాతం ఉన్న బీసీ వర్గాలను ఓటు బ్యాంకు కోసం చూశారు. ఏ ఒక్క కులానికి గజం భూమి ని కేటాహించలేదు. బీసీలకు గత ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కానీ ఏమి చేసింది లేదు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే నాయకులను తయారు చేసిన ఈ వర్గాలకు చదువుకోవడం కోసం ఏలాంటి ఏర్పాట్లు గతంలో చేయలేదు. కానీ టీఆర్‌ఎస్‌ 13 కుల సంఘాలకు కోకపేటలో సుమారు 40 ఎకరాల విలువైన భూమిని కేటాహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. భవనాల నిర్మాణం కోసం త్వరలోనే అన్ని కుల సంఘాలకు అందజేస్తాము.

minister srinivas goud

భవనాల నిర్మాణంలో కుల సంఘాల పెద్దలను, అధికారులను భాగస్వాములను చేస్తాం.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రి కేటీఆర్ భవనాలకు కావలసిన ఏర్పాట్లు చేద్దామని చెప్పారు. ఈ ఆత్మ గౌరవ భవనాల ద్వారా వెనుకబడిన వర్గాలకు కావలసిన అనేక అవసరాలను పెళ్లి వేదిక కాని, వృత్తి నైపుణ్య శిక్షణ ట్రైనింగ్ సెంటర్, విద్యార్థుల వసతి గృహంలతో పాటు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ భవన్‌లో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

క్షత్ర స్థాయిలో పరిశీలించిన రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేస్తుము. త్వరగా పూర్తయ్యే విధంగా చూస్తాం. 3 నెలల్లో ఆత్మ గౌరవ భవనాలకు సంబంధించిన అన్ని సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక శాసన సభ్యులుప్రకాష్ గౌడ్, జలవనరుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనిత రాజేంద్రన్, అదనపు కార్యదర్శి సైదా, రెవెన్యూ శాఖ అధికారులు చంద్రకళ, పురపాలక శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -