వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి- శ్రీనివాస్‌ గౌడ్‌

174
Minister Srinivas Goud
- Advertisement -

మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డుల వారీగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ లెవెల్ ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కౌన్సిలర్, బూత్ లెవల్ ఇన్‌చార్జీలు ప్రతి ఓటరును కలిసి ఓటు వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వార్డులోని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్లను కలువాలన్నారు. పట్టుభద్రులు తప్పకుండా ఓటు వేసే విధంగా చూడాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి.

- Advertisement -