కరోనాపై పాటలను ఆవిష్కరించి మంత్రి శ్రీనివాస్ గౌడ్

170
- Advertisement -

ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రూపొందించిన ప్రముఖ నటుడు శ్రీకాంత్‌తో కలసి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో దర్శకుడు బాలాజీ దూసరి రూపొందించిన గీతాలను ఆవిష్కరించారు.

hero srikanth

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల నేడు పూర్తి నియంత్రణలో ఉందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా స్వీయ నియంత్రణలో ఉండి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇప్పటికే ఎన్నో అవగాహన గీతాలను రూపొందించి ప్రజలకు అందించామన్నారు.

srinivas goud and srikanth

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… కరోనాపై రూపొందించిన పాటలు చాలా బాగా ఉన్నాయన్నారు. దర్శకులు చాలా అద్భుతంగా తీశారన్నారు. దర్శకులు బాలాజీ దూసరిని మరియు పాటల రచయితలు కోదారి శ్రీను, అభి ఉప్పుల, ఎడిటర్ బాల ఇల్లందు లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, నటుడు శ్రీకాంత్ అభినందించారు.

- Advertisement -