ఈటలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్‌..

207
minister srinivas goud
- Advertisement -

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రెస్‌ మీట్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోపాటు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ ,ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ ,కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు- ఈటలకు ఆరేళ్లుగా గ్యాప్ ఉంటే మంత్రి పదవి ఎలా వచ్చింది?.. కేసీఆర్ అనే వ్యక్తి, టీఆర్‌ఎస్ పార్టీ లేకుంటే ఈటల ఎక్కడ ఉండే వారు! అని ప్రశ్నించారు. ఈటెలపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు!. ఈటల తనంతట తాను చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈటల నచ్చని- మెచ్చని పార్టీకి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈటల ఆలోచన చేసుకోవాలి మంత్రి విమర్శించారు.

హరీష్ రావును కాదని ఈటలకు ఫ్లోర్ లీడర్ పదవి కేసీఆర్ ఈటలకు ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీకి ముందు- పార్టీలోకి వచ్చిన తరువాత ఈటల ఏంటో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ చేసిన తప్పు ఏంటో ఈటల రాజేందర్ చెప్పాలి? ఆరు సార్లు ఎమ్మెల్యే గా టీఆర్‌ఎస్ పార్టీ- కేసీఆర్ లేకుండా ఈటల పేరుమీద గెలిచారా? ఇప్పుడు ఈటల రాజేందర్ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది హుజురాబాద్‌లో అభివృద్ధి చేసే పార్టీకి- అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు పోటీ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని పార్టీ బీజేపీ అని మంత్రి దుయ్యబట్టారు.

రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ.. వరవరరావును జైల్లో పెడితే కేసీఆర్ పరామర్శించలేదు అన్న ఈటల ఆయను జైల్లో పెట్టిన పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నారు?.. బీజేపీ భూ స్థాపితం అవుతుందని అన్న ఈటల- ఎందుకు బీజేపీలో చేరుతున్నారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ను గొప్పతనాన్ని పొడిగిన విషయం గుర్తించేసుకోవాలన్నారు. ఈటల వ్యక్తిగతంగా జరిగిన తప్పును నిరూపించుకోలేక ప్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. ఈటల బీజేపీలో చేరి పెట్రోల్-డీజిల్ తగ్గిస్తారా? పోలవరం తరహాలో తెలంగాణకు జాతీయస్థాయి ప్రాజెక్టు రప్పిస్తారా? ఇనెళ్లు ఈటలను పెంచి పోషించిన కేసీఆర్‌పై అబండాలు వెయ్యడం కరెక్ట్ కాదు. ఈటెలకు మర్యాద ఇవ్వలేదు అంటే ఎలా? మంత్రి పదవి ఇచ్చారు చాలదా? అన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకడానికి ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ తెచ్చారు. బడుగుబలహీన వర్గాల ప్రజలు ఇవ్వాళ ఆత్మగౌరవంతో ఉన్నారు అని బండ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -