నెట్ బాల్ అసోసియేషన్ సభ్యులను అభినందించిన శ్రీనివాస్ గౌడ్..

124
srinivas goud
- Advertisement -

ష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో రాష్ట్ర నెట్ బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా మహబూబ్ నగర్ కు చెందిన విక్రమ్ ఆదిత్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మొహమ్మద్ ఖాజా ఖాన్ లతో పాటు ఉపాధ్యక్షులు గా సదత్ ఖాన్, మనోజ్ కుమార్, అహ్మద్ ఖాజా బేగం, విజయ్ వర్ధన్ లతో పాటు కార్యవర్గ సభ్యులు గా వెంకట్, షఖిల్ తదితరులు ఎన్నికైన సందర్భంగా అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందులో నెట్ బాల్ క్రీడను ప్రోత్సాహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి క్యాబినెట్ సబ్ కమిటీ ని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నామన్నారు. క్రీడాకారులకు, కోచ్ లకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కు రాష్ట్రంలో పెద్ద పీట వేయబోతున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -