రాష్ట్రంలో 50 స్టేడియాల నిర్మాణం: శ్రీనివాస్ గౌడ్

159
srinivas goud
- Advertisement -

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 చోట్ల స్టేడియాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాపాలసీ కోసం క్యాబినెట్‌ సబ్ ‌కమిటీ వేశారని తెలిపారు.

ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2శాతం రిజర్వేషన్లు కల్పించామని….క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో పలు క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పురస్కారాలు ప్రదానం చేశారు.

- Advertisement -