దేశ సంపదను అంబానీలకు దోచిపెడుతున్న మోదీ:సత్యవతి

181
Minister-Satyavathi-Rathod
- Advertisement -

దేశ సంపదను అదాని, అంబానీలకు దోచిపెడుతున్న బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్ జైలుకు పోతాడంటూ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సత్యవతి…..ఈనెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని కోరారు.

ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో చాయ్‌ అమ్మిన మోదీ.. ఇప్పుడు మొత్తం రైల్వే వ్యవస్థనే ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి, మహబూబాబాద్‌ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకలను కేంద్ర మంత్రులు పొగుడుతుండగా, ఆపార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారని వెల్లడించారు.విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం ఏ ఒక్కటీ అమలుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పూర్తికాని పోలవరం కనిపిస్తుంది కానీ, బీడువారిన నేలను తడిపిన కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

- Advertisement -