దళిత బంధుపై కాంగ్రెస్‌ను నిలదీద్దాం:సత్యవతి

21
- Advertisement -

దళిత బంధు పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నాయకులమంతా కలిసికట్టుగా నిలదీద్దాం అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో మాట్లాడిన మంత్రి సత్యవతి…అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేసి గెలుద్దాం అన్నారు. గిరిజనుల్లో ఉన్న కొన్ని అపోహలు తొలగించి తిరిగి వారి మద్దతు బీ ఆర్ ఎస్ కు కూడగట్టేలా ప్రయత్నం జరగాలన్నారు.

అధికారం లోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కూడా అనుకోలేదన్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్. .కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో బీఆర్ ఎస్ ఓడిపోయిందని,ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్ దే అన్నారు. .మనం చేసినవి సరిగా చెప్పలేక పోయాం ..జరిగిందేదో జరిగింది ..ఇక పార్లమెంటు ఎన్నికల పై దృష్టిసారిద్దాం అన్నారు. నేతలంతా సమన్వయంతో పని చేస్తే మహబూబాబాద్ లో బీ ఆర్ ఎస్ ను గెలిపిద్దాం అన్నారు.

Also Read:KTR:చేసిన పని చెప్పుకోలేకపోయాం..అందుకే ఓటమి

- Advertisement -