ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి..

154
Minister Sabithareddy
- Advertisement -

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు వెళ్లుతున్నారు మంత్రి. మంగళవారం మంత్రి మోమిన్ పెట్ మండల కేంద్రంలో పిఎం జిఎస్‌వై రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.మోమిన్ పెట్ నుండి కోల్కుంద వరకు 3 కోట్ల 24 లక్షలతో నిర్మించనున్న ఈ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ గారు,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైయ్యారు.

- Advertisement -