ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా రివ్యూ..

125
sabitha
- Advertisement -

ఈ నెల 25 నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని శాఖలతో సమీక్ష నిర్వహించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాం…నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని చెప్పారు.

జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాము…కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందన్నారు. 25వేల మంది ఇన్విజిలేటర్ లు పాల్గొంటున్నారు…పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గంట ముందు పరీక్షా కేంద్రం లోకి విద్యార్ధులకు అనుమతి ఉంటుందని…..ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించాలన్నారు.

ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం పై ఆగ్రహం వ్యక్తం చేశారు సబితా. పరీక్షల టైమ్ లో ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.

- Advertisement -