ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితారెడ్డి..

104
- Advertisement -

ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులందరికీ మార్గదర్శనం. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసేది గురువులే.. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు మంత్రి.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని..100% అక్షరాస్యత సాధించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. మౌలిక వసతులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -