ఎన్టీఆర్ జయంతి…రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

131
roja
- Advertisement -

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆమె…అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని ఆరోపించారు. బాలకృష్ణను చూస్తే జాలేస్తుందని…ఇన్నాళ్లు గుర్తుకు రాని నిమ్మకూరు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు రాసే స్క్రిప్ట్‌ చదవడం మానేసి బాలకృష్ణ ఎన్టీఆర్‌ వారసుడిగా బయటకు రావాలని సూచించారు.

జగన్‌ను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారని….మహానాడులో తిట్టపురాణం తప్ప మరేమిలేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదని ఎద్దేవ చేశారు. ఎన్టీఆర్‌ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదని…చంద్రబాబు జీవితమంతా 420 పనులేనని అన్నారు.

కోనసీమలో మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్య అని పేర్కొన్నారు.

- Advertisement -