ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

147
Minister Puvvada
- Advertisement -

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సమయంలో వినియోగించే ఆక్సిజన్ కష్టాలు తీరిపోయాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ కష్టాలు తీర్చేందుకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయడమైంది, ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 13వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100 సిలిండర్ లతో కరోనా రోగులకు ఆక్సిజన్ ను అందించడం జరుగుతుందని, అదే విధంగా నిమిషానికి 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ను తయారు చేసే ఆక్సిజన్ జనరేటర్ ఇప్పటికే వినియోగంలో ఉండగా, దానికి అదనంగా తాజాగా 13వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుతో కరోనా బాధితులకు ఆక్సిజన్ ను అందించడంతో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కష్టాలు ఉండవన్నారు.

దీనితో ఇప్పుడు 140 మందికి ఒకే సారి వైద్య చికిత్స అందించేలా ఏర్పాటు చేయడంతో రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు సులభతరంగా మారుతుందన్నారు. అనంతనం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను పరామర్శించి వారికి ఆత్మస్థైర్యం కల్పించారు మంత్రి పువ్వాడ. అక్కడ అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, భోజనం, త్రాగునీరు, వేడి నీరు, మెడిసిన్ తదితర అంశాల వివరాలు తెలుసుకున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి.అనంతరం కోవిడ్ రోగులకు భోజన ప్యాకెట్స్ ను వారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, ITDA PO గౌతమ్, అదనపు కలెక్టర్ అనుదీప్, DM&HO శిరీష, వైద్య శాఖ ఉన్నతాధికారులు, వివిధ ఆసుపత్రుల బాద్యులు, వైద్యులు ఉన్నారు.

- Advertisement -