మంత్రి పువ్వాడకు ఆర్టీసీ ఉద్యోగుల అపూర్వ స్వాగతం..

576
- Advertisement -

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు ఖమ్మం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మంత్రికి బాణసంచా కాల్చి, కొలటంతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్యోగులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు. కార్మికులకు మంత్రి స్వీట్లు తినిపించారు.

Puvvada Ajay Kumar

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు రానున్న రోజుల్లో ఆర్టీసీ లాభాల బాటలో నడిపిస్తామన్నారు.ఆర్టీసీ బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగుల స్థాయిలో భవిష్యత్‌ ఉంటుందని అని మంత్రి అజయ్‌ కుమార్‌ అన్నారు.

kcr

Minister Puvvada

Telangana Transport Minister Puvvada Ajay Visits Khammam Bus Depot.. Telangana Transport Minister Puvvada Ajay Visits Khammam Bus Depot..

- Advertisement -