టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయండి: పువ్వాడ

120
puvvada
- Advertisement -

ఎన్నిక ఏదైనా ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ విజయం సాధిస్తూ వచ్చిందని అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.

ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అజయ్‌… ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు, ఎమ్మెల్యే రాములు నాయక్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెటింగ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -