సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వేముల..

261
Minister Prashanth Reddy
- Advertisement -

“నిజామాబాద్‌లో వెటర్నరీ మెడికల్ కాలేజీ మంజూరి ఇచ్చినందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. కామారెడ్డి పట్టణానికి 50 కోట్ల రూపాయలు,ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి 25 కోట్ల రూ,బాన్సువాడ మున్సిపాలిటీకి 25 కోట్ల రూ. చొప్పున అడిగిన వెంటనే మంజూరు చేసి మరోసారి వారి దాతృత్వాన్ని, కామారెడ్డి ప్రజల మీద ఉన్న ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా చాటుకున్నారు. జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామపంచాయతీకి 10లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి పల్లెల పట్ల ఆయనకున్న ఆప్యాయతను చూపించారు.

పట్టణాలు,పల్లెల అభివృద్ధి కోసం పట్టణప్రగతి,పల్లెప్రగతి కింద నెలనెలా ప్రభుత్వ ప్రత్యేక నిధులు వస్తున్నా… కామారెడ్డి,బాన్సువాడ,ఎల్లారెడ్డి పట్టణాలకు,జిల్లాలోని 526గ్రామ పంచాయితీలకు అదనంగా నిధులు మంజూరు చేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం వారు తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జిల్లా ప్రజల పట్ల ఉన్న అపార ప్రేమను,ఇష్టాన్ని తెలియజేస్తుంది. ప్రజాప్రతినిధులు,అధికారులు ఇట్టి ప్రత్యేక నిధులు అర్థవంతంగా పల్లెలు,పట్టణాల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతున్న” అని మంత్రి తెలిపారు.

- Advertisement -