ఓట్లు వేసిన రైతులు నీకు బ్రోకర్లు గా కన్పిస్తున్నారా..?

171
Vemula Prashanth Reddy
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైతుల నిరసనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండి పడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. బాధ్యతగల ఎంపీ రైతులను బ్రోకర్లుగా అభివర్ణించడం ఆయన అహంకారానికి నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపి అరవింద్ తీరుపై మండిపడ్డారు.

దేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడడం హేయనియం అన్నారు. ఎంపీ మాటల్లో రైతుల పట్ల కేంద్రంలో బీజేపీ వైఖరి స్పష్టమవుతోందన్నారు. రైతులను కార్పొరేట్ కంపెనీల బానిసలుగా చేయాలని చూస్తున్న బీజేపీ ఆటలు సాగవన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతు ఢిల్లీ సరిహద్దుల్లో న్యాయపోరాటానికి దిగితే కేంద్ర బలగాలతో రైతులపై దాడి చేయించి గోస పెట్టాలని చూస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎంపీ మాటల్లో తేటతెల్లం అయిందన్నారు.

అయినా పసుపుబోర్డు పేరు తో గెలిచి రైతులను నయవంచన చేసిన వ్యక్తికి రైతులు బ్రోకర్లు గానే కన్పిస్తారని దుయ్యబట్టారు.రైతుల పై మీ అహంకారపు వ్యాఖ్యలు మీ పథనానికి ప్రారంభమన్నారు.

- Advertisement -