ప్రభుత్వ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలా..?

75
prashanth reddy
- Advertisement -

ప్రభుత్వ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలను తరలించి దిగజారుడు రాజకీయాలకు బీజేపీ నేతలు తెరలేపారన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధికారిక కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తుంటే నినాదాలు చేస్తూ అడ్డుకొని అవమానించారు బీజేపీ కార్యకర్తలు.

ఈ నేపథ్యంలో స్పందించిన ప్రశాంత్ రెడ్డి…తాను ప్రభుత్వం తరుపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని.. ముగ్గురు కేంద్ర మంత్రుల సాక్షిగా బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించి తెలంగాణ ప్రతిష్టను మంటగలిపారని దుయ్యబట్టారు. నీచమైన కేంద్ర బీజేపీలో నాకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీ అని తెలిపిన ప్రశాంత్ రెడ్డి… రహదారుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా తాను వెళ్ళానని చెప్పారు.

తెలంగాణ పురోగమిస్తున్న రాష్ట్రం అని నితిన్ గడ్కరీ ఆయన ప్రసంగంలో చెప్పారు… ప్రభుత్వ కార్యక్రమం అని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మాకు చెప్పారు…క్కో కార్పొరేటర్ కు వెయ్యి మందిని తీసుకోని రావాలని బీజేపీ భాద్యతలు ఇచ్చినట్లు తెలిసిందన్నారు. బీజేపీ కండువాలు వేసుకోని ప్రభుత్వ కార్యక్రమంలో 3వేల మంది ఉన్నారు….తాను మాట్లాడితే అంత ఉలికిపాటు ఎందుకు? అని ప్రశ్నించారు. 8వేల కోట్లు గిఫ్ట్ గా ఇస్తున్నాం అనడం మంచిది కాదు… అన్ని రాష్ట్రాల తరహాలో నే తెలంగాణకు ఇచ్చింది అంతే అన్నారు.

- Advertisement -