కేంద్రానికి చికిత్స చేయాలి: కేసీఆర్

81
cm kcr
- Advertisement -

రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్.బి. స్టేడియంలో ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిన్నారుల‌కు సీఎం చేతుల మీదుగా తోఫా అందించారు. ఇఫ్తార్ విందు సందర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేదు.. చాలా దుర్భర పరిస్థితులు ఉండేవని.. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామని తెలిపారు. దేశం అంతా చీకట్లో ఉంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సర్కార్‌పై మండిపడ్డారు సీఎం. కేంద్రానికి రోగం సోకిందని చికిత్స చేయాలన్నారు.కేంద్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని, దేశం ఏ విధంగాను నష్ట పోకూడదన్నారు. కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు… దేశాన్ని నిర్మించడం కష్టమని వెల్లడించారు. ఇక్కడ అల్లర్లు చేసే వారి ఆటలు సాగవని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా మైనారిటీ గురుకుల విద్యాలయాలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -