కాళేశ్వరం నిర్మాణం ప్రపంచంలోనే అద్భుతం- మంత్రి

176
minister
- Advertisement -

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరిన సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ సమీపంలో మంజీర నది వద్ద గోదావరి నీటికి పూజలు నిర్వహించారు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP బిబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజుల సురేందర్, హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ. శరత్, ఇరిగేషన్ CE మధుసూదన్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అద్భుతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మాణం సాద్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తీసురావడంలో స్పీకర్ పోచారం కృషి గొప్పది. ముఖ్యమంత్రిని పట్టుదలగా ఒప్పించి నీటిని తెప్పించారు. ఇప్పటికే గోదావరి జలాలతో నడీ ఎండాకాలంలో కూడా వాగులు, వంకలు, చెక్ డ్యాంలు, చెరువులు మత్తడులు దూకుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా హల్ధీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం అన్నారు.

సభాపతి పోచారం మాట్లాడుతూ.. భగీరధుడు “దివి నుంచి భువికి” గంగను తీసుకువస్తే నేడు అపర భగీరధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిని “భువి నుండి దివికి” తీసుకువచ్చాడని కొనియాడారు.గోదావరి నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు అంటే అర కిలోమీటర్ ఎత్తిపోసి బీడు భూములకు నీరందిస్తున్నారని అన్నారు. ఏడాది మొత్తం నిజాంసాగర్ నిండు కుండలా ఉండాలనే నలబై ఏళ్ళ నా కల ఈరోజు నెరవేరింది. కరోనా భయం ఉన్నా నెరవేరిన నా కలను కళ్ళారా చూసుకుందామనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. గోదావరి జలాలు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరిన ఈరోజు నిజంగా చారిత్రాత్మకం. లక్షలాది రైతుల సాగునీటి కష్టాలకు ముగింపు పలికిన సందర్భం..నది నీళ్ళు ఉప నదిలోకి ప్రవహించడం అంటే బిడ్డ దగ్గరకు తల్లి చేరడం వంటిది. ఇంత గొప్ప విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వలనే సాధ్యం అయిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -